GST revenue Persentage increased in Andhra Pradesh posts More than compared to Telangana | ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా చోటు చేసుకున్నాయి. ఈ పెరుగుదల 22 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే ఆగస్టులో వచ్చిన జీఎస్టీ వసూళ్లు 2,591 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం అదే ఆగస్టు నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 3,173 కోట్ల రూపాయలకు పెరిగింది. తెలంగాణతో పోల్చుకుంటే 12 శాతం అధికంగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 10 శాతమే. హైదరాబాద్ వంటి ప్రధాన ఆదాయాన్ని అందించే నగరం లేనప్పటికీ, ఏపీ మాత్రం తెలంగాణ కంటే అధికంగా జీఎస్టీ రెవెన్యూను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
#GST
#Andhrapradesh
#telangana